భీమ రధశాంతి వేడుక
Bhima RadhaShanti Ceremony
Telugu Traditional Event : Bhima RadhaShanti Ceremony –
60 సంవత్సరములు నిండిన తరువాత ఉగ్రరథ శాంతి (షష్టి పూర్తి) జరిపినట్లే 70 సంవత్సరములు నిండిన పిమ్మట భీమరధశాంతి జరుపు కుంటారు. పది ముందు తరముల వారికి పదకొండు భావితరముల వారికి విష్ణులోక నివాసము కల్పించగల కనకాభిషేకము అను క్రియ నిర్వర్తించుటకు సహస్రమాస జీవులు మాత్రమే అర్హులని పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పినట్లు ధర్మశాస్త్రములు తెలుపుచున్నవి. ప్రపౌత్రుని అనగా మనుమని మనుమని చూచిన వ్యక్తియైనను దీనిని ఆచరించ వచ్చును.